సమాచార హక్కు చట్టం 2005 ఏర్పడి 18 సంవత్సరాలు కావొస్తున్న నేటికి ఈ చట్టం పై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలలో జరిగే పనులలో పారదర్శకత జవాబుదారీతనం లోపం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ప్రభుత్వ పనులకు పెడుతున్న ఖర్చులు ,ఫైల్స్ ని తెలుసుకునే హక్కు ప్రతి పౌరునికి ఉన్నది సమాచార హక్కు చట్టం పై అవగాహనా లేని ప్రజల కు ప్రభుత్వాలు ఈ చట్టం పై ప్రచారం కల్పించడం లో విఫలం చెందాయి. దీనికోసం ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ గారు ఆర్టీఐ సతీష్.కామ్ అనే వెబ్సైట్ ని ఏర్పాటు చేసి ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని సంకల్పించారు.. దీనిని ప్రతి ఒక్కరు ఆ వెబ్సైట్ ద్వారా సమాచార హక్కు చట్టం కి సంబంధించిన అంశాలను చదివి తెలుసుకోవాల్సినదిగా వారు కోరారు.







