ఆర్టీఐ మరియు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం

జస్టిస్ యాక్సెస్ నెట్వర్క్ ఆద్వర్యంలో “సమాచార హక్కు చట్టం మరియు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం “. పై ఒక్కరోజు వర్క్ షాప్

15-06-2025 ఆదివారం రోజు హైదరాబాద్ సూర్య లోక్ కాంప్లెక్స్, అబిడ్స్ లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథి ఆర్.టి.ఐ కమీషనర్ దేశాల భూపాల్ గారు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం, ప్రభుత్వం చేపట్టే ప్రతి పని పారదర్శకంగా, జవాబుదారీతనం తో జరుగుతుందో లేదో తెలుసుకోవడానికి సామాన్యుడి చేతిలో ఆయుధంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ జన్ నెట్వర్క్ ద్వారా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని, ప్రతి జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అంతే కాక ప్రభుత్వ బాధ్యతగా సమాచారం హక్కు చట్టం కార్యకర్తల పిటీషన్లకు సరైన సమాధానాలు వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ చట్టంలోని విది విధానాలపై వక్తగా ఆర్టిఐ రక్షక్ గౌరవ అధ్యక్షులు, విజిల్ బ్లోయర్ అష్రఫ్ అహ్మద్ గారు మాట్లాడుతూ 40 వేలకు పైగా పెట్టిన పిటీషన్ల గురించి వివరించారు. మరో వక్త హైకోర్టు అడ్వకేట్ చింతల శ్రీకాంత్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఏవిధంగా వేయాలి, ఎటువంటి సమాచారం పొందుపరచాలనే విషయాలను వివరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరించిన ప్రొఫెసర్ రామకృష్ణ కొలికిపోగు మాట్లాడుతూ సమాజం బాగుండాలని, అందరికీ సమాన హక్కులు, సమగ్ర అభివృద్ధి చేరాలన్నా, అవినీతి నిర్మూలన జరగాలన్నా జస్టిస్ యాక్సెస్ నెట్వర్క్ సభ్యులంతా ఐక్యంగా పనిచేయాలన్నారు.త్వరలో అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సమాచార హక్కు చట్టం పై అవగాహన కలిగి ఉండలన్నారు. ఆర్టీఐ కార్యకర్తలు వేసే అప్లికేషన్స్ ప్రజా ప్రయోజనాలు కలిగి ఉండేలా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. ఈ కార్యక్రమాన్ని అమెరికా నుంచి డా మహేష్ బండ తో పాటు, కె నరేందర్, బి సురేష్, మరియు వి ఐలేష్ కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కండె వెంకట్, రోశనగరి యాదయ్య, సాయి కిరణ్, పెద్దయెత్తున సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

ఏఐ రంగంలో భారత్ సంచలనం

ఏఐ రంగంలో భారత్ సంచలనం: ChatGPT, Geminiలకు గట్టి పోటీ ఇస్తున్న Sarvam AI RTI SATISH: బెంగళూరు: ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ మరోసారి తన సామర్థ్యాన్ని చాటింది. ఇప్పటివరకు ఏఐ అంటే అమెరికా, చైనా ఆధిపత్యమే అన్న…

Continue reading
నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్య ఆయుధమా?

  సమాచార హక్కు చట్టం: అధికారుల చేతుల్లో నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్య ఆయుధమా? RTI SATISH: ప్రత్యేక కథనం ప్రజాస్వామ్యంలో పాలకులు యజమానులు కారు — ప్రజలే అసలైన యజమానులు. కానీ ఆ యజమానులే ప్రశ్నలు అడిగితే, సమాధానాలు దాచిపెట్టే పరిస్థితి ఎందుకు…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఏఐ రంగంలో భారత్ సంచలనం

ఏఐ రంగంలో భారత్ సంచలనం

నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్య ఆయుధమా?

నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్య ఆయుధమా?

ఆర్టీఐ మరియు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం

ఆర్టీఐ  మరియు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం

ఆర్టీఐ రక్షక్ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన – ఆర్టీఐ సతీష్

ఆర్టీఐ రక్షక్ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన – ఆర్టీఐ సతీష్

రామన్నపేట తహశీల్దార్ కార్యాలయంలో నిర్లక్ష్యంగా మూలకు పడేసిన సమాచార హక్కు బోర్డు

రామన్నపేట తహశీల్దార్ కార్యాలయంలో నిర్లక్ష్యంగా మూలకు పడేసిన సమాచార హక్కు బోర్డు

పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరేళ్ల విఠలాచార్య గారిని సన్మానించిన ఆర్టీఐ రక్షక్ టీం

పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరేళ్ల విఠలాచార్య గారిని సన్మానించిన ఆర్టీఐ రక్షక్ టీం