సమాచార హక్కు దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్ ప్రభుత్వ హాస్పిటల్ పేషేంట్లకు ఆర్టీఐ రక్షక్ టీం పండ్ల పంపిణి

Rtisatish:- యాదాద్రి జిల్లా సమాచార హక్కు చట్టం 2005 వ సంవత్సరం లో అక్టోబర్ 12వ తేదీన ప్రజలకు అందుబాటులోకి ఈచట్టం అమలులోకి వచ్చింది. నేటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆర్టీఐ రక్షక్ టీం ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో పేషేంట్లకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ ,రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ రాపోలు లింగస్వామి హాజరయ్యి డాక్టర్ల చేతుల మీదుగా పండ్లు పంపిణీ చేశారు. ఆర్టీఐ సతీష్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ఏర్పడి 18 సంవత్సరాలు పూర్తి అయిన నేటికి ప్రభుత్వాలు ప్రజలు అడిగిన దరఖాస్తులకు సమాచారాన్ని ఇవ్వకుండా కాలయాపన చేస్తూ రాష్ట్ర కమిషనర్లు లేక రాష్ట్ర సమాచార కమిషన్ లో కొన్ని వేల కేసులు పెండింగ్ లో పెట్టి చట్టానికి ఉన్న లక్ష్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఈ చట్టం అమలుకు ఆర్టీఐ కార్యకర్తలు కృషి చేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు కార్యకర్తలను భయపెట్టి అక్రమ కేసులు పెట్టి మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టం లోని పారదర్శకత జవాబుదారీతనాన్నీ పాటించాలని కోరారు. చట్టం యొక్క ముఖ్య లక్ష్యాలను ప్రభుత్వాలు నెరవేర్చాలని లేనిచో ఆర్టీఐ కార్యకర్తలు ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసి చట్ట సభలలో న్యాయ స్థానాల్లో సమాచార హక్కు చట్టం లోని సెక్షన్ లను కాపాడుకుంటామని అలాగే ఆర్టీఐ చట్టం పై ఉన్న సమస్యలను చట్ట సభలలో ప్రశ్నించి ,పరిష్కరించే విధంగా ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి చేసి ఆర్టీఐ రక్షక్ టీం ద్వారా పోరాడుతామని ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు..
ఈ కార్యక్రమంలో ఆర్టీఐ రక్షక్ టీం రోశనగరి యాదయ్య, బుగ్గరాములు, ఐతరాజు అశోక్ , కత్తుల రవీందర్, వనం విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఏఐ రంగంలో భారత్ సంచలనం

ఏఐ రంగంలో భారత్ సంచలనం: ChatGPT, Geminiలకు గట్టి పోటీ ఇస్తున్న Sarvam AI RTI SATISH: బెంగళూరు: ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ మరోసారి తన సామర్థ్యాన్ని చాటింది. ఇప్పటివరకు ఏఐ అంటే అమెరికా, చైనా ఆధిపత్యమే అన్న…

Continue reading
నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్య ఆయుధమా?

  సమాచార హక్కు చట్టం: అధికారుల చేతుల్లో నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్య ఆయుధమా? RTI SATISH: ప్రత్యేక కథనం ప్రజాస్వామ్యంలో పాలకులు యజమానులు కారు — ప్రజలే అసలైన యజమానులు. కానీ ఆ యజమానులే ప్రశ్నలు అడిగితే, సమాధానాలు దాచిపెట్టే పరిస్థితి ఎందుకు…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఏఐ రంగంలో భారత్ సంచలనం

ఏఐ రంగంలో భారత్ సంచలనం

నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్య ఆయుధమా?

నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్య ఆయుధమా?

ఆర్టీఐ మరియు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం

ఆర్టీఐ  మరియు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం

ఆర్టీఐ రక్షక్ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన – ఆర్టీఐ సతీష్

ఆర్టీఐ రక్షక్ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన – ఆర్టీఐ సతీష్

రామన్నపేట తహశీల్దార్ కార్యాలయంలో నిర్లక్ష్యంగా మూలకు పడేసిన సమాచార హక్కు బోర్డు

రామన్నపేట తహశీల్దార్ కార్యాలయంలో నిర్లక్ష్యంగా మూలకు పడేసిన సమాచార హక్కు బోర్డు

పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరేళ్ల విఠలాచార్య గారిని సన్మానించిన ఆర్టీఐ రక్షక్ టీం

పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరేళ్ల విఠలాచార్య గారిని సన్మానించిన ఆర్టీఐ రక్షక్ టీం